ముగ్గులెందుకు వేస్తారు | ధర్మ సందేహాలు
హేమంతంలో సూర్యుడు భూమికి దూరంగా ఉంటాడు. కనుక వాతావరణం చల్లగా ఉండి, క్రిమికీటకాలు స్వేచ్ఛగా సంచరించి, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ మాసంలో ఇంటి ముంగిళ్లలో పేడనీళ్లు చల్లి, గుల్లసున్నంతో ముగ్గులేస్తారు. ముగ్గులోని క్యాల్షియం క్రిమికీటకాల సంహారానికి తోడ్పడుతుంది. ఆవుపేడతో కళ్లాపి చల్లటం వల్ల అందులోని రేడియానికి గల రోగ సంహరణ శక్తితో ఈ రుతువులో వచ్చే క్రిములు నశిస్తాయి.
Post a Comment