పంచాంగం విషయాలు | ధర్మ సందేహాలు
- అక్షయ తృతీయ, విజయదశమి, కార్తీక మాసంలో శుక్లపక్ష పాడ్యమి రోజున సాయంత్రం వరకు సాడేతీన్ ముహూర్తములు అంటారు. ఈ దినములలో పంచాంగం చూడకుండానే ప్రతి శుభకార్యం ప్రారంభించవచ్చు.
- రాహు కాలంలో శుభకార్యాలు, గులికకాలంలో ఆశుభకార్యాలు ప్రారంభించరాదు.
- తిధులు: రెండు పక్షములందున చవితి, షష్టి, అష్టమి, నవమి, ద్వాదశి, చతుర్ధశి తిధులలో మంచి పనులు మొదలుపెట్టకూడదు. అమావాస్య రోజు పితృ కర్మలు చేయవచ్చును. శుభకార్యాలు చేయరాదు.
- గ్రహణం పట్టుచుండగా స్నానం, పూర్తిగా పట్టినపుడు జపము, విడచిన పిమ్మట స్నానం చెయ్యాలి. గ్రహణం తర్వాత ఏడు రోజులు ఎటువంటి శుభకార్యాలు చేయరాదు.
- ప్రయాణమునందు అపశకునము కలిగిన కాళ్ళు కడుగుకొని, కాస్త విశ్రమించి, బెల్లమును తిని బయలుదేరాలి.
- శన్యూషః కాలం అనగా శనివారం రోజు సూర్యోదయమునకు ముందు రెండు ఘడియల (నలుభది ఎనిమిది నిముషాలు) నుంచి సూర్యోదయం వరకు వుండే కాలాన్ని శన్యూషః కాలం అంటారు. ఆ సమయంలో ఏ మంచి పని మీద అయినను ప్రయాణం మొదలెడితే, ఆ పని తప్పక నెరవేరుతుంది. అంటే ఆ సమయంలో ప్రయాణం చెయ్యాలి.
Post a Comment